సమస్త భారతావని గర్వించదగ్గ దేశభక్తుడు, భరతమాత ముద్దుబిడ్డ డా.బి.ఆర్ అంబేద్కర్ నోటినుండి జాలువారిన కొన్ని ఆణిముత్యాలవంటి అక్షరాలను ఏరుకొని భద్రంగా దాచుకోండి.....
- నేనూ,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది.
- ముస్లింలు, క్రైస్తవులు, పారశీకులు కాని భారతీయులందరూ హిందువులే.
- తమ తోటి స్వయంసేవకుని కులం తెలుసుకోవాలనే కనీస కుతూహలం కూడా లేకుండా సమరసతా భావనతో మెలుగుతున్న RSS నడవడిక నన్నెంతగానో ఆశ్చర్యపరిచింది. (13 మే 1939నాటి పునాలోని ఆరెస్సెస్ శిబిరంలో)
- మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం.
- గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.
- కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.
- పుస్తకాలు దీపాలవంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది.
- మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలమూ తిరిగిరాదు.
- కులం పునాదుల మీద మీరు దేనిని సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు.
- దేశానికి గానీ,జాతికి గానీ సంఖ్యా బలమొక్కటే చాలదు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
- కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి