28, ఏప్రిల్ 2021, బుధవారం

హాహాహూహూ నవలా సమీక్ష

భారతీయ సంస్కృతీ విలువలు, దైవ భాష సంస్కృతం యొక్క ప్రాధాన్యతను బహు చక్కగా వివరించిన నవల ఇది.

పరిచయం:

ఈ నవల 1952 లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణచే రచించబడింది. 1982లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వచ్చింది. గ్రంథకర్త కుమారుడు, నవల సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి. విశ్వనాథునివి మొత్తం 118 రచనలు. అందులో 57 నవలలు.

సంక్షిప్త కథ:

లండనులో ట్రిఫాల్గార్ స్క్వేర్ వద్ద గుర్రం మనిషి శరీరంతో వింత జంతువు కనిపిస్తుంది. చేతి కడియం ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఆ విచిత్ర జీవి స్పృహలో ఉండదు. దీనిని బందీఖానాలో ఉంచి దానిపై వివిధ రకాల శాస్త్రీయ పరమైన ప్రయోగాలు చేద్దామని కొందరు అనుకున్నారు. కానీ అవన్నీ ఫలితం లేకుండా పోతాయి. ఈ వింత జంతువును ప్రజలు హా హా హూ హూ అని పిలుస్తారు. ఈ హా హా హూ హూ మాట్లాడుతుంటే స్పష్టంగా అర్థం కావాలి అంటే చాలా దూరానికి వెళ్ళాలి కానీ దాని దగ్గరలో నిలబడితే గోలగా అరిచినట్లు అనిపిస్తుంది. పైగా హా హా హూ హూ మాట్లాడే భాష సంస్కృతం.

ఈ వింత జంతువు గురించి ప్రపంచం నలుమూలలకు తెలుస్తుంది. వివిధ దేశాల నుండి భాషాశాస్త్రవేత్తలు జంతు శాస్త్రవేత్తలు వచ్చి ఆ వింత జంతువు పై పరిశోధనలు చేయడానికి ప్రయత్నిస్తారు. వీరందరికీ చమత్కారమైన మాటలతో సమాధానం చెప్పి వెనుదిరిగే లా హా హా హూ హూ చేస్తుంది . ఉదాహరణకు భాష జంతు శాస్త్రవేత్తలు ఇద్దరూ ఆ మృగము యొక్క మెదడును ముఖకవళికలను పరీక్షించుటకు తన మెదడును శస్త్రచికిత్స చేసి పరిశీలిస్తామని అనుమతి అడుగుతారు. అప్పుడు ఆ మృగం గట్టిగా నవ్వి మీకు ఈ చిలిపి ఆలోచనలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు దీనిని తెలుసుకొనుటకు నేను మీ పై పరిశోధన చేయవచ్చా అని అడిగింది అంతే ఈ ఒక్క ప్రశ్న తో వాళ్ళు వెనుదిరిగారు.

నిజానికి అది మృగం కాదు ఒక గంధర్వుడు ప్రతి రోజూ ధ్యానం లో ఉండేవాడు ఆహారం తీసుకునే వాడు కానీ విసర్జన లేదు కళ్ళు తెరిచి నోరు తెరిచి మాట్లాడగలడు కానీ హృదయ స్పందన స్పందన శ్వాస లేవు. చాలాసార్లు ఈ గంధర్వుడి పై పరిశోధనలు చేయడానికి నానారకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి తుపాకీ లో గుళ్లను ఈ గంధర్వుడి శరీరం లోకి చొచ్చుకు పోయేలా చేశారు కానీ అవి అతని ని ఏమి చేయలేదు అతనిని తాకగానే కింద పడి పోవడం లేదా నేరుగా వెనక్కి వెళ్లిపోవడం జరుగుతుండేది.

చివరకు ఈయన మృగం కాదు మంచి జ్ఞానం గల వ్యక్తి అని ఆ దేశ అతిథి గృహానికి పంపించి అతిథి మర్యాదలు చేశారు. చివరకు ఒక చేతిలో వీణ ను పట్టుకొని వాయిస్తూ నెమ్మదిగా ఆకాశం వైపు పయనం సాగించాడు.

వర్ణనలు మరియు ముఖ్య సన్నివేశ మాటలు:

1. గంధర్వుడి పై ఉన్న వస్త్రాన్ని పరీక్షించి అంతటి సుకుమారమైన వస్త్రం ఏ దేశంలో చేశారో తెలియదు కానీ డక్కా మజిలీన్లు అని చెప్పుకుంటారు ఏవైనా అంత సన్నగా ఉంటాయో లేదో అని వర్ణించారు 

2. యూరోపియన్లు మాట్లాడే సంస్కృతం కొంత భిన్నంగా ఉంది గంధర్వుడు మాట్లాడే సంస్కృతం ఏ గ్రంథంలో ను ఎవరు మాట్లాడలేని స్పష్టమైన సంస్కృతం.‌ యూరోపియన్లు ఆస్తికళా అనవల్సి వస్తె ఆ ను వ వలె ఉచ్చరించి,స ను షా చేసి లా ను ళా గా ఉచ్చరిస్తారు. దీర్ఘం ఉన్న చోట హ్రస్వమూ హ్రస్వమున్న చోట దీర్ఘమూ ఉచ్చరిస్తారు. నారాయణః అనుటకు నరయనాః అంటారు.‌ ఇక్కడ రచయిత సంస్కృతభాష యొక్క ప్రాధాన్యతను తెలియజేశాడు.

3. మనుషులకు దంత్యములు తాలవ్యములు ఆ అవయవాల పరిమాణం ఉచ్చరించబడేవి విధంగా ఏర్పడి ఉంటాయి ఇవి జంతువులకు ఉండవు కావున మాట్లాడలేవు. ఈ వాక్యం ద్వారా మాటలు ఎలా మాట్లాడగలము అన్న విషయాన్ని బహు చక్కగా వివరించారు.

4. శబ్దోఛ్ఛారణ జరగాలంటే అభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం రెండు జరగాలి అందులో స్పష్టములు ఈషత్పష్టములు ఇది మనుషుల జ్ఞానం తో కూడిన వ్యవహారం.

5 ఏ శబ్దం ఉచ్చరించే ఎందుకు ఎంత గాలి మనం నా దగ్గర నుంచి పుట్టించాలి అది కంఠంలో ఎంత ముఖంలో కి ఇచ్చిన గాలి తాలువులకో దంతాలకో ఎక్కువ తగిలించాలో తక్కువ తగిలించాలో ఇదంతా మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని బట్టి మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. వీటినే సంస్కృత వయీకరణలు స్పృష్టమనీ,ఈశాతప్రుష్టమని సంవాదం అని వివాదం అని అంటారు బాహ్యాభ్యంతర ప్రయత్నాలు తల్వాది స్థానాన్ని బాహ్య ప్రయత్నం అంటారు.

6. పండితులకు భాష శాస్త్రవేత్తలకు మధ్య సంభాషణ ఈ క్రింది విధంగా జరిగింది.

భాష పశువు శాస్త్రవేత్తలు గంధర్వుడికి శస్త్రచికిత్స చేసి పరిశోధన చేయాలనుకుంటారు అప్పుడు పండితులు, 'ఆయన అట్ల మాట్లాడుతుంటే ఆయన ముఖ్య అవయవాలూ మాట్లాడేందుకు అనుగుణంగా ఉన్నాయనే గా అటువంటి జ్ఞానం ఉండేందుకు ఆ మెదడు ఉన్న పదార్థం అనువైనదని కదా ఈ విషయం సామాన్యమైన జ్ఞానమునకు అనుమీయవుతుండగ(ఊహించదగినది) మీరు ఇంత పరిశోధన చేయాలి అనడం బాగాలేదు.'‌ అప్పుడు భాషా శాస్త్రవేత్త, ' మేము పరిశోధిస్తాము అన్నది ఆ విషయం కాదు ఆయన వదనంలో అవయవాలు మనుష్య ముఖా అవయవాల కన్నా భిన్నంగా ఉండి ఆ శబ్దములు ఉచ్చరించబదుతున్నవేమో అన్న విషయం. మీకు మాకు ప్రధాన విషయాలలో కొంత భేదం ఉంది మీరు ప్రతిదీ ఊహించి అంటారు మేము ప్రయోగం చేసి చూడవలెనంటాము ఊహ యదార్థము కాకపోవచ్చు కానీ మా పరిశోధన ఎప్పుడు యధార్థం అవుతుంది' అపుడు పండితుడు, 'మేము ఊహిస్తామంటే వెర్రి మొర్రి గా ఊహించము గదా ఒక హేతువులు పురస్కరించుకుని ఊహిస్తాము.' దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే పండితులకు శాస్త్రవేత్తలకు మధ్య గల వ్యత్యాసం, వారి దగ్గర ఉన్న విద్య ఎటువంటిదో ఎవరికి ఉపయోగపడుతుందో అనే ఈ విషయాన్ని తెలియజేసే విధంగా ఉంది.

7. పండితులు హా హూ తో మా దేశాలలో విషయం తెలుసుకుందాం అన్న జిజ్ఞాస ఎక్కువ మా దేశస్తులు ఇతర ఖండాలకు పోయి అక్కడ ఉన్న వింతలు విశేషాల గురించి వ్రాస్తుంటారు అని అన్నప్పుడు ఆ గంధర్వుడు ఇలా సమాధానం ఇస్తాడు ఎందుకు పనిచేయడం సృష్టి విభిన్నమైనదని మీకు తెలియదా సృష్టిలో వివిధ రకాల జంతువులు జాతులు ఉన్నాయి వాటికి వేరు వేరు అలవాట్లు వేరు వేరు జీవన విధానం ఉంటుంది మొట్టమొదట కొత్త మృగాలను కొత్త జాతుల ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అది అజ్ఞానం యొక్క లక్షణం. శాస్త్ర పరిజ్ఞానం కలిగిన తర్వాత బుద్ధి పరిపక్వం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఉండదు పైగా మనం ఒక విషయం గురించి తెలుసుకుంటే దానిని అనేక రకాలుగా ఊహించవచ్చు తర్వాత దానిని ప్రత్యక్షంగా చూస్తే ఆశ్చర్యం ఏమీ ఉండదు మీరు ఆలోచించి మనస్సును ఏకాగ్రం గా ఉంచి విషయముల యొక్క యధార్థం తెలుసుకోలేరల్లే ఉంది.

8. ఒకసారి బిషప్ అనే క్రైస్తవ పాస్టర్ హూహూ తో ఇలా అంటాడు మీ మతం ఏమిటి? దేవుని కుమారుడు క్రీస్తు. మనం ఆయనను నమ్మితే గాని భక్తి లేదు అని. అప్పుడు హూహూ ఇలా సమాధానం ఇస్తాడు సామాన్యులకు మతము లేదు. ఒకానొక మహర్షి చెప్పిన మతము నందు ఒకనికి విశ్వాసం ఉంటుంది. అల్పుని విశ్వాసం అల్పమైంది. అధికుని విశ్వాసం అధికమైంది. ఏ లోకం లో అయినా ప్రాణులందరూ వాంచాదూషితులు. వాంచాతీతుడై బ్రహ్మ పదాన్ని ఎవడు సేవిస్తాడో వాడికి అల్పమైన ఇట్లాంటి వాటితో అవసరం లేదు. మతం అంటే ఏమిటో ఎవరికి తెలుస్తుంది? మొట్టమొదట లోకము యొక్క తెలి నశ్వరత్వం తెలిస్తే చాలు. ఈ మాటల్లో తాత్విక భావన ఉట్టిపడేలా మోక్ష ప్రాప్తి కొరకు చేయాల్సిన కృషి ని గురించి చక్కగా వివరించారు.

9. చిన్న చేప చిన్న చెరువులో ఉంటుంది. పెద్ద చేప పెద్ద చెరువు లో ఉంటుంది. తిమింగలం సముద్రంలో ఉంటుంది. అంతే కానీ చిన్న చెరువులో మంచినీళ్లలో ఉండే చేపను సముద్రంలో వేస్తే చస్తుంది అలాగే మన శరీరాలు మన సంస్కారానికి అనుగుణంగా ఉంటాయి. మనము ఉన్న దేశాన్ని శరీరాన్ని మన పూర్వీకుల ఆచరణని బట్టి ఉంటుంది ఇది గాఢమైన బంధం. ఈ మాటలు గంధర్వుడు పాశ్చాత్య పండితులతో అంటుంటాడు ఈ మాటల్లో స్వదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని విడిచి పెట్టినట్లయితే ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి అన్న విషయాన్ని ఈ చిన్న ఉదాహరణ ద్వారా అద్భుతంగా వివరించారు.

10. తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువ పోగు చేస్తాననడం కన్నా ఒక్క విషయం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కృతార్థత ఎక్కువ.

నవల పై నా అభిప్రాయం:

మనుషుల యొక్క చిలిపి చేష్టలను గురించి గంధర్వుడి చేత కవి చెప్పకనే చెప్పించాడు. భారతీయ సంస్కృతి విలువల గురించి జనని భాష సంస్కృత ప్రాధాన్యత గురించి అద్భుతంగా వివరించారు. 

ఇది రెండు మూడు గంటల్లో చదవగల చిన్న నవల. చదువుతున్నకొద్దీ ఆసక్తి తెప్పిస్తూ, ఎన్నో తాత్విక భావాలను ఇనుమడింప చేసిన నవల.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...